సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి అటు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా కొత్త విషయం తెలుస్తుందేమో అని  సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా హీరో హీరోయిన్ లకు సంబంధించిన పెళ్లి, కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు  అయితే ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల గురించి అయితే దాదాపు అందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లుగా వందల సినిమాల్లో నటించిన సావిత్రి జయసుధ జమున వాణిశ్రీ లాంటి వారి గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పాలి.


 ముఖ్యంగా జయసుధ తెలుగు చిత్ర పరిశ్రమలో సహజ నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రతి పాత్రలో కూడా ఒదిగిపోయి నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు ఒకప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించారు జయసుధ. ఒకప్పుడు జయసుధ తో పాటు నటించిన ఎంతోమంది హీరోయిన్లు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయారు అని చెప్పాలి. కానీ జయసుధ మాత్రం ఒకప్పుడు హీరోయిన్గా ఇక ఇప్పుడు తల్లిగా నాన్నమ్మ గా ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే జయసుధ వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ వాళ్ల బామ్మర్ది అనే రాజేంద్రప్రసాద్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.


 జయసుధ పెళ్లి చేసుకున్న రాజేంద్రప్రసాద్ ఒక వ్యాపారవేత్త కావడం గమనార్హం. ముందుగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇంట్లో కాదన్నారు. చివరికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగానే జయసుధ రాజేంద్రప్రసాద్ పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత అందరిని ఒప్పించి బంధువులందరిని పిలిచి ఘనంగా రిసెప్షన్ పెట్టుకున్నారట. ఈ పెళ్ళికి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు అందరు హాజరైనట్లు తెలుస్తోంది. జయసుధ అభిమానులు సైతం పెళ్లి చూడటానికి తరలి వచ్చారట. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రాజేంద్రప్రసాద్తో జయసుధ విడిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత జయసుధ ఎన్నో రోజులు గ్యాప్ తర్వాత నితిన్ కపూర్ తో పరిచయం ఏర్పడి చివరికి పెళ్లి వరకు వెళ్ళింది.  ఇక ప్రస్తుతం  జయసుధ కెరీర్ గురించి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: