పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న భామ పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ కలిసి ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారత దేశం సహా పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరాం, మురళీశర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు చేసిన ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి మంచి స్పందన రాబట్టాయి. లవ్, యాక్షన్, ఎమోషనల్ స్టోరీ గా పలు ఆసక్తికర అంశాలతో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తీసిన ఈ సినిమా వాస్తవానికి ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సి ఉన్నపటికీ, దేశంలో కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం రాధేశ్యామ్ మూవీని మార్చి మొదటి వారంలో, వీలైతే మార్చి 4న రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీని మార్చి 18న రిలీజ్ చేసేందుకు ఆ మూవీ యూనిట్ సన్నద్ధం అవుతుండడంతో దానితో తమకు క్లాష్ లేకుండా పక్కాగా రెండిటికి రెండు వారల గ్యాప్ ఉండేలా రాధేశ్యామ్ యూనిట్ మార్చి 4న తమ సినిమా రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసేందుకు చూస్తున్నారట. అలానే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న అందించేందుకు యూనిట్ సిద్ధం అవుతోందట. మరి ఇదే కనుక నిజం అయితే ఎప్పటి నుండో రాధేశ్యామ్ రిలీజ్ కోసం చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: