చియాన్ విక్రమ్ అంటే  తెలియని ప్రేక్షకుడు అంటూ ఉండరేమో..అయితే ఈయన   తమిళ్ లో మాత్రమే కాదు తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు.ఇక  శివపుత్రుడు, అపరిచుతుడు లాంటి మూవీస్ తో అప్పట్లోనే తెలుగునాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇతడు.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు విక్రమ్.అయితే  ఆ క్రమంలో ప్రశంసలు వచ్చాయి గానీ హిట్స్ మాత్రం తగ్గిపోయాయి. ఇకపోతే గత కొన్నేళ్లలో ఐ లాంటి ప్రయోగాత్మక చిత్రం చేసిన విక్రమ్.. ఇప్పుడు కోబ్రా లాంటి మరో ఎక్స్ పెరిమెంట్ మూవీతో వస్తున్నాడు. ఇక.ఇందులో దాదాపు పది పాత్రల్లో నటించినట్లు తెలుస్తుంది. 

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన విక్రమ్.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.అయితే “మా నాన్న హెడ్ మాస్టర్. ఆయన నటుడు కావాలని చెన్నై వచ్చారు.ఇక  నేను మూడేళ్లకే ఓ చిత్రంలో పాపగా నటించాను. పోతే నాకు నటన అంటే పిచ్చి.  కాగా అలా కోబ్రా కథ వినగానే చేయాలనిపించింది. అంతేకాదు కొవిడ్ వల్ల బాగా ఆలస్యమైంది.అయితే  రష్యాలో మైనస్ 40 డిగ్రీల చలిలో కూడా ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం.అంతేకాదు  ఈ చిత్రంలో పది పాత్రలు చేశాను... ఒక్కో దాని మేకప్ కోసం ఐదారు గంటలు పట్టేది.  ఈ సినిమా ఛాలెంజింగ్ గా అనిపించింది. నాకు తెలిసింది నటనే. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులకు ఎప్పుడు కొత్త అనుభూతి పంచాలని, భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తాను” అన్నారు విక్రమ్.“ఈ మధ్య ఒంట్లో బాగాలేక ఆస్పత్రిలో ఉన్నాను. 

ఇక దీంతో నా ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వచ్చాయి. ఇకపోతే మరికొందరైతే ఏకంగా నా ఫొటోకి దండేసి, ఫ్రేమ్స్ పెట్టి, నేను లేనట్లు ప్రచారం చేశారు.  ఇక ఇవన్నీ చూసిన నాకు చాలా బాధేసింది. అయితే దీంతో ఐదురోజులపాటు ఐసీయూలోనే ఉన్నాను” అని విక్రమ్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం విక్రమ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైకలాజికల్ సైన్స్ పిక్షన్ డ్రామాగా తెరకెక్కిన కోబ్రా సినిమాలో విక్రమ్ కి జంటగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించింది. ఇకపోతే మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇందులో కీలకమైన రోల్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా.. ఈ సినిమాకు డిమాంటి కాలనీ, అంజలి ఐపీఎస్ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. అయితే ఆగస్టు 31న పాన్ ఇండియా వైడ్ విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: