మళయాళ భామ నిత్యా మీనన్ తెలుగులో అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ది గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రలతో చాలా సహజమైన నటనతో ఆకట్టుకుంది నిత్యా మీనన్. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అందుకున్న నిత్యా మీనన్ ఈమధ్య టాలీవుడ్ లో అవకాశాలు అందుకోవట్లేదు. మహానటి సినిమా ఆఫర్ ముందు నిత్యా మీనన్ దగ్గరకే వెళ్లగా ఆమె తనకు తాగుడు సీన్స్ నచ్చవు సినిమాలో అవి తీసేయండని చెప్పి షాక్ ఇచ్చింది. అందుకే ఆమె ప్లేస్ లో కీర్తి సురేష్ మహానటి అయ్యింది.

ఆ సినిమాలో నిత్యా ఉంటే ఎలా ఉండేదో కానీ కీర్తి సురేష్ ఆ పాత్రలో చేసిన అభినయం ఆమెకు నేషనల్ అవార్డ్ తెచ్చి పెట్టింది. అర్రె ఓ మంచి సినిమా మిస్ అయ్యామన్న బాధ ఉన్నా అప్పటినుంచి తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు నిత్యా మీనన్. అయితే తెలుగులో చేయకపోయినా సరే తమిళంలో ఆమె తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తుంది. ధనుష్ హీరో గా నటించిన తిరుచిత్రంబలం మూవీ లో ఆమె నటించింది. ధనుష్ ఫ్రెండ్ పాత్రలో నిత్యా మీనన్ నటన ఆకట్టుకుంది.

ఆ సినిమాని తెలుగులో తిరుగా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుగు లో కూడా అలంటి పాత్రలు వస్తున్నా ఆమె మాత్రం టాలీవుడ్ అవకాశాలను మాత్రం స్కిప్ చేస్తుంది. నిత్యా మీనన్ తెలుగు సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే తెలుగు లో తనని ఇంప్రెస్ చేసే కథలు రావట్లేదని అంటుంది నిత్యా మీనన్. మరి త్వరలోనే అమ్మడు తెలుగు సినిమాల్లో నటించాలని ఆశిద్దాం. ఫీమేల్ సెంట్రిక్ సినిమా అయినా సరే ఓకే అంటున్న నిత్యా మీనన్ మరోసారి తన ప్రతిభతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: