దలపతి విజయ్ ఇప్పుడు తమిళ్ తో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కూడా విజయ్ కు మంచి మార్కెట్ ఉంది.ప్రస్తుతం ఈ హీరో వరిసు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మూవీపై అంచనాలు పెంచాయి.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ తర్వాత విజయ్.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చేయనున్నాడు.


డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో రాబోతున్న ఈ దళపతి కెరీర్‏లో 67వ చిత్రంగా తెరకెక్కనుంది. ఇక ఈ నే కాకుండా తాజాగా విజయ్ తెలుగులో మరో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం వరిసు చిత్రీకరణలో బిజీగా ఉన్న దళపతితో మరో నిర్మిస్తేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కసరత్తులు చేస్తుందట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి విజయ్ ను సంప్రదించగా.. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం..


ఈ మేరకు విజయ్ నెక్స్ట్ తెలుగు సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ జరుగుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ ను డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించనున్నారట. ఇటీవలే మైత్రీ మూవీస్ మేకర్స్ అట్లీని సంప్రదించినట్లుగా టాక్. వీరిద్దరి కాంబోలో వచ్చిన తెరీ, మెర్సల్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో.. మరోసారి హిట్ కాంబో రిపీట్ కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం అట్లీ .. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో జవాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయన్ కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చే వరకూ ఆగాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: