తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తేరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత స్వామి రారా , కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి విజయవంత మైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నిఖిల్ "కార్తికేయ 2" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.

మూవీ కి టాలీవుడ్ యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించగా ,  అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్షమూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి , భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. ఈ మూవీ జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా నవంబర్ 20 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తాజాగా జీ సంస్థ ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: