కరోనా వేవ్ లు పూర్తిగా తెలుగు రాష్ట్రాలలో అదుపులో ఉండటంతో ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి పై భారీ అంచనాలు ఉన్నాయి. చాలాకాలం తరువాత బాలకృష్ణ చిరంజీవిల ఫైట్ గా సంక్రాంతి మారడంతో ఇప్పుడు వారు నటిస్తున్న ‘వాల్టేర్ వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ లపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే ఈ రెండు సినిమాల పబ్లిసిటీ కూడ భారీ స్థాయిలో చేస్తున్నారు.


అయితే ప్రస్తుతానికి ‘వీరసింహా రెడ్డి’ పై వాల్టేర్ వీరయ్య’ పై చేయి సాధించాడా అన్న సందేహాలు కొందరకు కలుగుతున్నాయి. దీనికి కారణం టివి ఛానల్స్ లో జరుగుతున్న ఏ డాన్స్ షోలో చూస్తున్నప్పటికీ ‘వాల్టేర్ వీరయ్య’ లోని ‘బాస్ వేరీజ్ ద పార్టీ’ మారుమ్రోగిపోతోంది. దీనికి తగ్గట్టుగానే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఈ పాటకు మంచి లైక్స్ కూడ వస్తున్నాయి.


ఈపాటకు పోటీగా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ కి సంబంధించిన పాటలు ఇప్పటి వరకు రెండు విడుదల అయినప్పటికీ ఆ పాటలు బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతున్నాయి కాని నేటి యువతకు బాగా కనెక్ట్ కాలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ‘వాల్టేర్ వీరయ్య’ లో చిరంజీవితో పాటు రవితేజా కూడ కలిసి నటిస్తూ ఉండటంతో మాస్ ప్రేక్షకులకు అది ఒక అదనపు ఆకర్షణగా ఏర్పడింది అంటున్నారు.


ఇక ‘వీరసింహారెడ్డి’ విషయానికి వస్తే ఈ మూవీ భారాన్ని అంతా బాలకృష్ణ మాత్రమే మోయవలసి వస్తోంది. దీనికితోడు ఈ మూవీకి సంబంధించి తమన్ అందించిన పాటలకు కూడ రెస్పాన్స్ అంత బాగాలేదు. అదేవిధంగా ఈ మూవీ కథలో వెరైటీ కనిపించదనీ గతంలో బాలకృష్ణ నటించిన చాల సినిమాల ఫ్యాక్షన్ ఛాయలు ఈ మూవీలో కనిపిస్తాయి అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ‘వాల్టేర్ వీరయ్య’ లో ఏమాత్రం కొత్తదనం కనిపించినా ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉంటే ‘వీరసింహారెడ్డి’ పై ‘వాల్టేర్ వీరయ్య’ విజయం సాధించడం ఖాయం అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ మొదలైపోయినట్లు తెలుస్తోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: