కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఇటీవల సర్దార్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కుక్కు, జోకర్ వంటి వైవిధ్యంతో కూడిన విజయవంతమైన చిత్రాల దర్శకుడు రాజు మురుగన్ జపాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించే కార్తీ ఈసారి కూడా విభిన్నమైన కథను ఎంచుకున్నాడు అని తెలుస్తోంది. ఇందులో అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో తెలుగు నటుడు సునీల్ , దర్శకుడు విజయ మిల్టన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకం పై ఈ సినిమాను ఎస్ఆర్ ప్రభు,  ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  నటుడు కార్తీ నటిస్తున్న 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై కూడా ఒకరకంగా అంచనాలు నెలకొన్నాయి తొలి షెడ్యూల్ తూత్తుక్కుడి జిల్లా పరిసర ప్రాంతాలలో పూర్తి చేసారు.  రెండవ షెడ్యూల్ కూడా జనవరి రెండవ వారం నుంచి కేరళలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ఈ పోస్టర్ కి మంచి స్పందన లభించిందని చెప్పవచ్చు.

ఇప్పుడు ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరొక విషయం ఏమిటంటే.. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఐటమ్ సాంగ్ లో చేయబోతుందంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడ లేదు కానీ రష్మికాను ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి కార్తీ ఒప్పించారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇందులో ఏది నిజం ఉందో తెలియాలి అంటే సినిమా నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికైతే కార్తీ కోసం రష్మిక ఐటమ్ సాంగ్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో కథనాల ద్వారా వార్తలు వెలువడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: