ప్రస్తుతం కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు నార్త్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది పూజ హెగ్డే. ఒక లైలా కోసం అనే సినిమాతో అటు అక్కినేని హీరో నాగచైతన్యతో జోడి కట్టి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలతో జోడి కట్టి సూపర్ హిట్ లను ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ ఛాన్సులు కొట్టేస్తుంది.


 సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసిక భాయ్ కీసిక జాన్ అనే సినిమాలో కండల వీరుడుతో రొమాన్స్ చేసింది పూజ హెగ్డే. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉండగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లు ఎవరు కూడా తనకు పోటీనే కాదు అంటూ పూజ హెగ్డే చెబుతోంది. వాళ్లను తాను పోటీగా చూడనని.. కాకపోతే ప్రతి విషయంలో తనను తాను మెరుగుపరుచుకుంటానని.. కానీ అది పోటీ కాదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాని వల్ల మేమంతా ఇక్కడ రాణించగలిగాము. నేనేం చేయగలనొ అదే చేస్తాను. వేరే వాళ్ళు చేసేది నేను చేయలేను. నన్ను నేను మెరుగుపరుచుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అంటూ పూజా హెగ్డే వ్యాఖ్యానించింది.



 నాకు నేను వ్యక్తిగత విమర్శకురాలినని.. అందుకే వేరొకరిని నేను నాకు పోటీగా చూడనని.. కేవలం నేనేం చేయగలనొ అది చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాను అంటూ తెలిపింది. ఇకపోతే ఇప్పటివరకు బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా పూజ హెగ్డేకు.. సరైన బ్రేక్ రాలేదు. మరి సల్మాన్ ఖాన్ తో నటించిన సినిమాతో అయినా ఈ ముద్దుగుమ్మ అక్కడ సూపర్ హిట్ కొడుతుందో లేదో అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: