తమిళ సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న శింబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన మన్మధ మూవీ ని తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 

శింబు ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు వరుస పరాజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన మానాడు మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. మానాడు మూవీ తర్వాత శింబు ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

 అందులో భాగంగా తాజాగా శంభో "పాతు తాల" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కి కృష్ణ దర్శకత్వం వహించాడు.  ఇది ఇలా ఉంటే థియేటర్ లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 27 వ తేదీ నుండి తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: