నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో  కృతి శెట్టి ..
 నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించగా వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ లో అరవింద స్వామి ... ప్రియమణి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.


సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ట్రైలర్ ను విడుదల చేయబోతుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు చెన్నై లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

 ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అయినటు వంటి నాగ చైతన్య నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే మానాడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తమిళ సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ఈ మూవీ పై ప్రస్తుతం ఇటు టాలీవుడ్ ... అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మే 12 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: