టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2014లో వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈమె. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన అందంతో పాటు అభినయంతో ఎందరో ప్రేక్షకులను మైమరిపించింది ఈ పొడుగు కాళ్ళ సుందరి. అయితే తాజాగా ఈమె సల్మాన్ ఖాన్ తో కలిసి ఇసుక భాయ్ కిసిక జాన్ సినిమాలో నటించిన ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగా వేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది పూజా హెగ్డే.ఇదిలా ఉంటే ఇక తాజాగా మదర్స్ డే సందర్భంగా  పూజా హెగ్డే తన తల్లి లతతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. 

ఇక ఈ నేపథ్యంలోనే పూజ హెగ్డే గురించి ఆమె తల్లి లతాపలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అయితే పూజా హెగ్డే కి కాబోయే భర్త ఎలా ఉండాలో అన్న ప్రశ్నకి బదులిచ్చింది తల్లి లత. పూజను అన్ని రకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి గురించి తాను ఎదురుచూస్తున్నాను అంటూ పేర్కొంది.. పెళ్లి అనే బంధం కలకాలం నిలిచి ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసే ఉండాలి.. ఒకరినొకరు గౌరవించుకోవాలి.. గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి ఉండడం చాలా కష్టం ఆ బంధానికి అసలు విలువ ఉండదు.. ఆ బంధం ఎప్పటికీ నిలవదు కూడా.. పూజా చాలా సున్నిత మనస్కురాలు..

తనకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కూడా అతను జాగ్రత్త తీసుకోవాలి ..అలాంటి వ్యక్తి కావాలి.. ఆయన స్ఫూర్తిగా నిలవాలి పూజ కెరీర్ ని ప్రోత్సహించాలి ..అలాంటి అబ్బాయిని పూజ కోరుకుంటుంది అంటూ చెప్పుకొచ్చింది లతా. ఇక తల్లి మాటలతో పూజా హెగ్డే సైతం ఏకీభవించింది. దాంతోపాటు తన తల్లితో తనకున్న అనుభవం గురించి కూడా పంచుకుంది పూజా హెగ్డే. పూజ హెగ్డే జీవితంలో తన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి తన తల్లి లత అంటూ చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. అంతేకాదు తన తల్లి కోరికలన్నీ తాను నెరవేరుస్తాను అంటూ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది పూజా హెగ్డే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: