
ఇక ఈ డబ్బు బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుంది. ఈ పథకం కింద అర్హులు ఎవరు అనే విషయానికి వస్తే.. సొంత వాహనం వుండి దానినే ఉపాధిగా నడుపుకుంటున్న ట్యాక్సీ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు , ఆటోడ్రైవర్లు, ఎండియు ఆపరేటర్లకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులు 10వేల రూపాయల చొప్పున పథకం కింద పొందుతున్నారు. ఇకపోతే ఈరోజు ఇచ్చే రూ.275.93 కోట్లను కలిపి మొత్తం ఇప్పటివరకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.1031.89 కోట్లు ఇచ్చినట్లు అవుతుంది. అంటే లబ్ధిదారులు ఈ ఐదు సంవత్సరాల లో ఒక్కొక్కరు రూ.50 వేల రూపాయల చొప్పున లబ్ధిని పొందినట్లు.
ఇకపోతే ఈ డబ్బులు వస్తున్నా కూడా ఖర్చులు బాగా పెరిగిపోవడం వల్ల వాహనాల రిపేర్లకు ఈ డబ్బు ఏ మాత్రం సరిపోవడంలేదని భావించేవారు ప్రభుత్వానికి ఏవైనా సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లయితే 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి మీ సమస్యలను చెప్పవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఫలితంగా ప్రభుత్వం లబ్ధిదారుల సమస్యలను తెలుసుకొని ఈ పథకంలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక మీరు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చు.