మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ సీజన్ 3 మొదలుకానుంది. ఇప్పటికే అనేక వివాదాలు షో చుట్టూ తిరుగుతున్నాయి. ఇటువంటి క్రమంలో బిగ్ బాస్ షో పై ఏపీ బీజేపీ నేత మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా షో నిర్వాహకులు...బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ ని ఎన్నుకునే సమయంలో వేసే ప్రశ్నలు...చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్ చేసింది.


ముఖ్యంగా హౌస్ నెంబర్ గా..హౌస్ లో కి వెళ్ళటానికి...ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో తనని షో నిర్వాహకులు వేసిన ప్రశ్నలు గురించి మాధవి లత చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా షో నిర్వాహకులు ఇంటర్వ్యూలో...హౌస్ లో ఎవరితోనైనా లవ్ లో పెడితే అనగా హౌస్ నెంబర్ తో ప్రేమలో పడితే ఏం చేస్తావు అని సో నిర్వాహకులు తనకి ప్రశ్న వేసినట్లు మాధవి లత చెప్పుకొచ్చారు.


దీంతో జవాబుగా ఇంటిలోకి వెళ్లక ముందే అలాంటివి ఎలా ఊహిస్తామని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే షోలో పాల్గొనే వాళ్లు కొంచెం ఆలోచించాలని...ఇలాంటి వాతావరణం కలిగిన ఇంటిలో ఇతరులతో కలిసి పడుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం అని, స్త్రీపురుషులిద్దరికీ వేర్వేరు బెడ్రూంలు పెట్టినప్పటికీ, కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే కొద్దీ, వారి ఒకే రూంలో పడుకునే పరిస్ధితి వస్తోందని మాధవీలత వాపోయారు. ఇంకా అనేక విషయాల గురించి మాధవీలత మాట్లాడుతూ..ఇలాంటి ఆటలు మహిళలకు తీవ్ర ఇబ్బందులు తీసుకు వస్తాయి అన్నట్టుగా వ్యాఖ్యానించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: