సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు
అశోక్ గల్లా డెబ్యూ
సినిమా కోసం అష్టకష్టాలు తప్పడం లేదు. ఎప్పుడో రెండు సంవత్సరాల నుంచి ఈ
సినిమా ఎప్పుడు పట్టా లెక్కుతుందా ? అని అందరూ ఆసక్తితో వెయిట్ చేశారు. అగ్ర
నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ప్రారంభమైన
అశోక్ తొలి
సినిమా కొన్ని సీన్లు షూట్ చేశాక ఆపేశారు. కారణం కరెక్టుగా తెలియకపోయినా
అశోక్ నుంచి సరైన ఎక్స్ప్రెషన్స్ రాకపోవడంతో ఈ ప్రాజెక్టు తనకు వర్కవుట్ కాదనే రాజు సినిమాను మధ్యలోనే ఆపేశారన్న టాక్ వినిపించింది.
ఎట్టకేలకు
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కే ఈ
సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబందించి ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. యంగ్ హీరోల డెబ్యూ సినిమాలు అనగానే
రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ కథలే ఉంటాయి. అయితే ఈ సినిమాలో కంప్లీట్ లవ్ స్టోరీ ఉండదట.
ఈ
సినిమా నేపథ్యం కూడా ఇంట్రస్టింగ్గా ఉండేలా ఎంచుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లీక్ అయిన కథ ప్రకారం
అశోక్ గల్లా ఈ
సినిమా లో
హీరో కావాలనే ప్రయత్నాల్లో ఓ క్రైమ్లో ఇరుక్కుపోతాడని తెలుస్తోంది. చివరకు ఈ క్రైం నుంచి బయటకు వచ్చి...
హీరో అయ్యాడా ? లేదా ? అన్న కథాంశంతోనే
సినిమా ఉంటుందంటున్నారు.
మరి ఈ కథను ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా
శ్రీరామ్ ఆదిత్య ఎలా ప్రజెంట్ చేశాడో ? చూడాలి. ఈ
సినిమా లో
అశోక్ సరసన
నిధి అగర్వాల్ నటిస్తోంది. ఆమెను ఈ సినిమాలో నటింప జేసేందుకే భారీ మొత్తం ఇచ్చి ఒప్పించారన్న టాక్ కూడా ఉంది. జిబ్రాన్ ఈ చిత్రానికి
సంగీత దర్శకుడు.
అమర్ రాజా ఎంటర్టైన్మెంట్ &
మీడియా బ్యానర్ పై ఈ సినిమాను
పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.