టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు తో హ్యాట్రిక్ విజయాలు అందుకుని మంచి జోరు మీదున్నారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్, మరొక రెండు నెలల తరువాత తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ని అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు.

 

మాఫియా బ్యాక్ డ్రాప్ లో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సంక్రాంతి 2021 కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
ఇకపోతే ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక హీరోగా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీర్, మే తరువాత ఫ్రీ అవుతారని, అలానే ఇటీవల ఆయనను కలిసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక మంచి కథను వినిపించడం జరిగిందని, అది నచ్చిన ఎన్టీఆర్, దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయమని చెప్పారట. అన్నీ కలిసి వస్తే మే నెలాఖరులో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్. కాగా హారిక హాసిని క్రియేషన్స్ సంస్థే ఆ సినిమాని కూడా నిర్మించనున్నట్లు చెప్తున్నారు. 

 

ఇక కేవలం ఆరు నెలల గ్యాప్ లోనే ఆ సినిమాని పూర్తి చేసి 2021 సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి తీసుకువచ్చేలా గట్టిగా ప్లాన్స్ చేస్తున్నట్లు టాక్. సో, దీనిని బట్టి చూస్తుంటే ఈసారి రాబోయే సంక్రాంతి సందర్భంగా సూపర్ స్టార్ తో యంగ్ టైగర్ తలపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు పట్టాలెక్కడానికి మరికొంత సమయం ఉంది కాబట్టి, ఒకవేళ చివర్లో రెండు సినిమాల రిలీజ్ డేట్స్ విషయమై కొద్దిపాటి మార్పులు జరిగినా జరగవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: