టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రామ్మా చిలకమ్మా అనే సినిమాతో తెరంగేట్రం చేసిన నటుడు ఆకాష్, ఆ తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన ఆనందం సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. కాగా అతనికి ఆ వెంటనే మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ సినిమాలు ఏవి కూడా రిలీజ్ కాలేదు. అనంతరం కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న ఆకాష్, ఆ తరువాత పెద్దగా అవకాశాల్లేక చాలా వెనుకబడిపోయాడు. ఇక ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆకాష్, సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో ఎదగాలంటే మరొక హీరోను తొక్కాలి, ఇక్కడ రాజకీయాలు చాలా ఎక్కువని సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. ఆనందం సూపర్ హిట్ తరువాత నేను ఐదు సినిమాల్లో హీరోగా చేశాను, 

 

కాకపోతే కొన్ని కుట్రల వలన ఆ సినిమాలను రిలీజ్ చేయనీయకుండా కొందరు ఆపేశారని అంటున్నాడు. ఇక కమెడియన్ సునీల్ తనను ఎంతో వాడుకుని, కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సునీల్ తో మొదటి నుండి తనకు మంచి అనుబంధం ఉందని, సునీల్ హీరోగా తెరకెక్కిన అందాల రాముడులో తనకు ఒక మంచి రోల్ కేటాయించారని, ఆ అవకాశం వచ్చిన వెంటనే తాను ఒప్పుకుని చేసానని, తీరా సినిమా మంచి సక్సెస్ సాధించిన తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో హీరో సునీల్, కనీసం తన పేరుని కూడా ప్రస్తావించలేదని అంటున్నాడు. ఇక దానితో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా తన మోసం చేసారని అన్నాడు. నిజానికి ఇటీవల పూరి రాసుకున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ కథ తనదే అని, 

 

అయితే ఆ సినిమా టీజర్, ట్రైలర్ తాను చూడలేదని, ఇక సినిమా రిలీజ్ కు కేవలం అతి కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఆ సినిమాను ఆపడం పద్ధతి కాదని భావించి వదిలేసానని అంటున్నాడు. అయితే ఇదే విషయాన్ని పూరి కి కూడా చెప్పానని, అయితే ఆయన నుండి ఎటువంటి స్పందన రాలేదని చెప్పాడు. ఇకపోతే ఇండస్ట్రీ లో తనకు హీరో రవితేజతో మంచి అనుబంధం ఉందని, ఆయన నటించిన చిరంజీవులు సినిమాలో తాను సెకండ్ హీరో రోల్ చేసానని, ఇక ఇప్పటికీ కూడా రవిగారు ఎక్కడ కనపడ్డా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని ఆకాష్ అంటున్నాడు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: