తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోసిన మహానటులు నందమూరి తారక రామారావు.  అందరూ ఆయన్ని అభిమానంతో ఎన్టీఆర్.. అన్నగారు అని పిలిచేవారు.  ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి మహానటుడిగానే కాదు మహానాయకుడిగా ఎదిగిన ఎన్టీఆర్ కోట్లు సంపాదించినా.. ప్రతి పైసా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవారని ఆయన సన్నిహితులు అంటుండే వారు.  ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దొరస్వామి రాజు తాజాగా సీనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర్ వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. ఎన్టీరామారావు తో నాకు మంచి అనుబంధం వుండేది. ఆయనతో సినిమాలు నిర్మించలేదుగానీ, ఆయన సినిమాలు చాలావరకూ నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. 

 

ఎన్టీఆర్ గారు సినిమాల విషయంలోనే కాదు నిర్మాత విషయంలో కూడా ఎంతో ఆలోచించేవారని అన్నారు.  స్వయంగా ఆయన నిర్మాత అవడం మూలంగా ఇతర నిర్మాతలకు నష్టం వచ్చే విధానాలు ఎప్పటికీ పాటించేవారు కాదని అన్నారు.  బడ్జెట్ విషయంలో కూడా ఆయన చాలా వరకు ఆలోచించి... ఎలాంటి అనవసర ఖర్చులు కాకుండా చూసేవారని ఆయన అన్నారు.  అందుకే ఎన్టీఆర్ తో చిత్రాలు తీయాలంటే చాలా మంది ఉత్సాహం చూపించేవారని దొరస్వామి అన్నారు.  అయితే ఎన్టీఆర్ తో తనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవని.. ఆయనను కలవడానికి ఉదయాన్నే 5 గంటలకు వెళ్లేవాడిని. ఆ సమయంలో ఆయన బసవతారకంగారితో మాట్లాడుతూ ఉండేవారు.

 

  ఆ రోజున ఇంట్లో ఏమేం చేయాలి? దేనికి ఎంత అవుతుంది? అనేది లెక్క చూసి ఆమెకి ఇచ్చేవారు. ఆ సమయంలో నేను అదేంటండీ.. వారానికో... నెలకో ఒక్కసారే ఇస్తే లెక్క సరిపోతుంది కదా అన్న ప్రశ్నకు ఆయన ప్రశాంతంగా సమాధానం చెప్పారు.  రాజుగారు .. మీరు కుర్రవారు మీకేం తెలుసు?' అని అన్నారాయన. అప్పుడు అర్తం అయ్యింది.. డబ్బు విషయంలో ఆయన అంత జాగ్రత్తగా ఉండేవారు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: