టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్, టాలీవుడ్ కి సదా సరసన నటించిన దొంగ దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజు భాయ్, ప్రయాణం, నేను మీకు తెలుసా, బిందాస్, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంట్ తీగ తదితర సినిమాలతో మంచి పేరు సంపాదించిన మనోజ్, కొన్నేళ్లుగా మాత్రం సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఆఖరి సినిమా ఒక్కడు మిగిలాడు 2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ కాలేకపోయింది. ఇక దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత ప్రస్తుతం మనోజ్ నటిస్తున్న సినిమా 'అహం బ్రహ్మాస్మి'. 

 

నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ సొంత బ్యానరైన ఎమ్ఎమ్ ఆర్ట్స్ పై తోలి వెంచర్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎంతో భారీ నిర్మాణాత్మక విలువలతో తెరకెక్కుతోంది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కనుందని, అలానే సినిమాలో మనోజ్ క్యారెక్టర్ ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల్లోని పాత్రల కంటే కొంత విభిన్నంగా ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

 

ఇకపోతే ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కోలీవుడ్ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ వైకుంఠపురములో సినిమా లో విలన్ గా నటించిన సముద్రఖని, ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే వరుస సక్సెస్ లతో సముద్రఖనికి తెలుగులో కూడా అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఎంతో వైభవంగా హైదరాబాద్ లో నిర్వహించనుంది ఈ సినిమా యూనిట్. కాగా దసరా పండుగ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: