టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కూడా తనకు అవకాశం ఉన్నంతవరకు ఫ్యాన్స్ తో పాటు తన వద్దకు వచ్చే వారిని కలిసి యోగ క్షేమాలు కనుక్కుని తనవంతుగా సాయం చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇప్పటివరకు అందరినీ నేరుగా లేదా అక్కడక్కడా బయట కొన్ని సందర్భాల్లో మాత్రమే కలిసి వివరాలు, యోగక్షేమాలు కనుక్కోవడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలో దాదాపుగా అందరు నటీనటులు కూడా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో జాయిన్ అయి ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఫైనల్ గా మొన్నటి తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ట్విట్టర్ తో పాటు మరొక ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇంస్టాగ్రామ్ లో కూడా అఫీషియల్ గా అకౌంట్స్ ఓపెన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇకపై ఈ మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ కు అలానే ప్రేక్షకులకు మరింతగా దగ్గరవ్వచ్చని అన్నారు. 

 

ఇక జాయిన్ అయిన దగ్గరి నుండి తనకు వెల్కమ్ చెప్పిన ప్రతిఒక్కరికీ కూడా అభినందనలు తెలుపుతున్నారు చిరు. ఇకపోతే మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీ పై సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ వెల్కమ్ సర్ అంటూ పోస్టులు పెట్టడం జరిగింది. అయితే మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఆయన ఎంట్రీ పై తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఏ మాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, అలానే కొందరు మెగా ఫ్యాన్స్ లో నిరాసక్తిని కలిగిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

 

అయితే ఇందులో పెద్దగా నిరాసక్తత వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, మెగాస్టార్ కు పవన్ పై, అలానే పవన్ కు మెగాస్టార్ పై మంచి ప్రేమాభిమానాలు ఉన్న విషయం అందరికీ తెలుసునని, వారిద్దరూ తరచూ కలుసుకుంటూనే ఉంటారు, అలాంటపుడు సోషల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చిన చిరుకు పవన్ ప్రత్యేకంగా పోస్ట్ ద్వారా వెల్కమ్ చెప్పకపోయినా, వ్యక్తిగతంగా ఎప్పుడూ కలుస్తూనే ఉంటారు కాబట్టి మధ్యలో దానిగురించి చర్చించుకుని ఉండవచ్చునని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా చిరు సోషల్ మీడియా ఎంట్రీ పై పవన్ కనీసం ఒక్క పోస్ట్ పెడితే బాగుండు అని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: