టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ ని చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇటీవల వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మూడు సక్సెస్ లు అందుకుని మంచి సక్సెస్ ట్రాక్ తో పాటు హ్యాట్రిక్ కొట్టిన మహేష్, పరశురామ్ తో చేసే సినిమాతో కూడా మరొక హిట్ కొట్టి సెకండ్ హ్యాట్రిక్ కి పునాది వేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ లను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు చెప్తున్నారు. 

 

తొలిసారిగా ఈ సినిమా ద్వారా దర్శకుడు కొరటాల శివ నిర్మాతగా మారబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో పాటు కొరటాల నెలకొల్పబోయే బ్యానర్ల పై ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు చేయబోయే సినిమాల లిస్ట్ భారీగా ఉండడంతో పాటు ఎందరో దర్శకులు ఇప్పటికే మహేష్ బాబు కాల్షీట్స్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వారిలో ముందుగా పరశురామ్ అనంతరం వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయనున్న మహేష్, దాని తరువాత త్రివిక్రమ్ లేదా అనిల్ రావిపూడి లతో మహేష్ సినిమా చేయనున్నారని, ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ, అలానే ఆపై మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్, అనంతరం దర్శక దిగ్గజం రాజమౌళి, వాటి అనంతరం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లతో పాటు క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకడు అజయ్ భూపతి కూడా మహేష్ బాబు సినిమాలు చేసే డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

 

అయితే ఈ ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా వరుసగా వారితోనే మహేష్ సినిమాలు చేస్తారా లేదా అనేది మాత్రం రాబోయే రోజుల్లో తెలియనుంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే మహేష్ బాబు చేయబోయే ఈ సినిమాల్లో చాలావరకు మంచి సక్సెస్ కొట్టేలా ఉన్నాయని, అలానే ఈ దర్శకులు నేనంటే నేను అని కుమ్ములాడుకోకుండా ఉంటే తప్పకుండా మహేష్ బాబు వీరందరిలో ఒకరితరువాత మరొకరితో సినిమాలు చేస్తారని ఆయన ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.....!!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: