బెంగుళూరుకు చెందిన స్వీటీ అనుష్క ముందుగా యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ పరిశ్రమకు తొలిసారిగా అడుగుపెట్టింది. అయితే ఫస్ట్ సినిమాలో తన ఆకట్టుకునే అందం తో ప్రేక్షకులను మెప్పించిన అనుష్క ఆ సినిమాతో ఆశించిన రేంజి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత నుండి మహానంది, విక్రమార్కుడు, అస్త్రం ఇలా వరుసగా అవకాశాలతో ముందుకు సాగింది అనుష్క. 

 

ఆపై సీనియర్ హీరోలయిన నందమూరి బాలకృష్ణ తో ఒక్కమాగాడు, వెంకటేష్ తో చింతకాయల రవి, అక్కినేని నాగార్జున తో కింగ్ వంటి సినిమాలు చేసి గ్లామర్ హీరోయిన్ గా మంచి సక్సెస్ లు అందుకున్నతప్పటికీ, వాటి అనంతరం కోడి రామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరుంధతి సినిమా, ఆమెకు నటన పరంగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు, క్రేజ్ ని తెచ్చిపెట్టడం జరిగింది.

 

సినిమా రిలీజ్ అయి, అత్యధిక కలెక్షన్ ని అలానే గొప్ప విజయాన్ని అందుకోవడంతో అక్కడి నుండి టాలీవుడ్ లో అనుష్క పెరు విరివిగా మారుమ్రోగసాగింది. అయితే  ఆ తరువాత ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా పంచాక్షరీ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తరువాత నుండి తన కెరీర్ ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న అనుష్క, అక్కడి నుండి ఎక్కువగా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటిస్తూ వస్తున్నారు. 


ఇటీవల ప్రభాస్ హీరోగా రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలలో దేవసేనగా అందంతో పాటు తన అభినయంతో కూడా ప్రేక్షకుల మదిని దోచిన అనుష్క, దాని తరువాత వచ్చిన బాగమతి సినిమాతో మరొక్కసారి తన నటనతో ఆడియన్స్ ని అలరించింది. ఇక ప్రస్థుతం నిశ్శబ్దం అనే థ్రిల్లర్ మూవీ చేస్తోన్న అనుష్క, ఈ విధంగా తొలిసారిగా సూపర్ సినిమాలో షాషా పాత్ర ద్వారా తన అందంతో, అలానే ఆపై అరుంధతి సినిమాలోనే జెజెమ్మ పాత్ర ద్వారా అద్భుతమైన అభినయంతో అందరినీ మెప్పించింది.......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: