ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్, పాపులారిటీ తో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్స్ లో రష్మిక కూడా ఒకరు అని చెప్పకతప్పదు. స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక, మొదటగా అక్కడ కిరిక్ పార్టీ అనే సినిమాలో నటించి మంచి పేరు దక్కించుకుంది. అనంతరం ఆమెను తెలుగులో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమా ద్వారా పరిచయం చేసారు యువ దర్శకడు వెంకీ కుడుముల. ఇక రిలీజ్ అనంతరం ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకోవడంతో పాటు తెలుగులో ఆ సినిమా తోనే రష్మిక కు మంచి పేరు రావడం జరిగింది.

ఇక దీని తరువాత విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన గీతా గోవిందం మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆపై ఆమెకు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించే ఛాన్స్ రావడం, రిలీజ్ తరువాత ఆ మూవీ కూడా పెద్ద విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన్న. ఇక ఇటీవల నితిన్ కు జోడిగా ఆమె నటించిన భీష్మ సినిమా కూడా విజయాన్ని అందుకుని ఆమె కెరీర్ కి మరింతగా బూస్ట్ ని ఇచ్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న రష్మిక అటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు చేస్తోంది.

కాగా ప్రస్తుతం ఆమె కాల్షీట్స్ డైరీ ఎంతో ఫుల్ గా ఉందని, అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పలువురు సినిమాల దర్శకనిర్మాతలు ఆమె తలుపులు తడుతూనే ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లో కూడా వరుసగా ఆఫర్లతో కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్మిక, వస్తున్న ఆఫర్లతో వారికి నో చెప్పలేక కొంత ఇబ్బందులు పడుతోందట. మరి ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో రాబోయే రోజుల్లో ఇంకెంత స్థాయిలో క్రేజ్ దక్కించుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: