టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట కథా, మాటల రచయితగా పనిచేశారు త్రివిక్రమ్. ఆ తర్వాత నువ్వే నువ్వే అనే సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అక్కడితో త్రివిక్రమ్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నడు. ఇక ఇక్కడ విశేషం ఏమిటంటే.. త్రివిక్రమ్ తో పనిచేసిన వారందరూ అగ్ర హీరోలు కావడం. తన కెరీర్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతోనే త్రివిక్రమ్ సినిమాలు తీసి విజయాలు అందుకున్నాడు.  త్రివిక్రమ్ ఒక కథను సెలెక్ట్ చేస్తే అది బంపర్ హిట్టు గ్యారెంటీ అన్న నమ్మకం హీరోలకు ఉంది.ఎప్పుడూ స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసే ఈయన...   నితిన్ లాంటి యువ హీరోతో కూడా సినిమా చేయడం గమనార్హం అని చెప్పాలి.

ఇక  ఇప్పుడు లేటెస్ట్ గా ఇస్మార్ట్ హీరో రామ్ తో కూడా త్రివిక్రమ్ పని చేయనున్నారని గత కొంతకాలంగా కథనాలొస్తున్నాయి.రామ్ రిక్వెస్ట్ మేరకు త్రివిక్రమ్ ఓ కథ రాస్తున్నాడట. ఈ కథ కోసం త్రివిక్రమ్ కి 10 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఉంటుందా లేదా అన్నది డౌట్ కానీ కథ స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్ ఇస్తున్నారని సమాచారం. అయితే ఇది పక్కనపెడితే ఈ ప్రాజెక్ట్ ని 45 కోట్లతో తెరకెక్కించాలని రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. అయితే రామ్ పై ఇంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది తెలియదు కానీ..

  జులాయ్ టైప్ లో ఓ కథ కావాలని రామ్ త్రివిక్రమ్ ని కోరినట్లుగా సమాచారం.మరి రామ్ కోసం త్రివిక్రమ్ జులాయి లాంటి కథ రాసి ఇస్తాడా?లేక కథ రాయడంతో పాటు తానే స్వయంగా డైరెక్ట్ చేస్తాడా?అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగక తప్పదు అంటున్నాయి సినీ వర్గాలు..ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. ఎన్టీఆర్ rrr షూటింగ్ పూర్తి చేసి వస్తే తప్ప ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు..మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: