ఇటీవల యూరప్లో లేటెస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా దాదాపు 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మిగిలిన భాగాన్ని అతి త్వరలో హైదరాబాద్ లో చిత్రీకరించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని యూనిట్ ప్రణాళిక సిద్ధం చేస్తోందట. ఇటీవల ఒక మీడియా చానల్ ఇంటర్వ్యూ లో భాగంగా హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా గురించి పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. తన కెరీర్లో రాధేశ్యామ్ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుందని అలానే ఈ సినిమాలో తాను నటిస్తున్న ప్రేరణ పాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చిన పూజా హెగ్డే ప్రభాస్ ఎంతో సిగ్గు పడుతూ ఎవరితో పెద్దగా మాట్లాడరు అనేటువంటి వార్తలపై స్పందిస్తూ ఆయన సెట్స్ లో ఎంతో సరదాగా ఉంటారు.
అంతే కాక సెట్ లో నన్ను అయితే మరింతగా ఆటపట్టిస్తుంటారని అన్నారు. అలానే తనతో పాటు మిగతా వారు అందరి పై సరదాగా జోక్స్ వేస్తూ ఇస్తూ ఉండే ప్రభాస్ తో కలిసి ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుందని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రిలీజ్ అనంతరం తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి తన కెరీర్ పరంగా మరింత గొప్పపేరు తెచ్చిపెడుతుందని అని ఆమె ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి