ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రపంచవ్యాప్తంగా  సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులని సంపాదించుకున్నాడు. క్లాస్, మాస్ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి వర్గాన్ని ఆకట్టుకొని టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరిగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్. కాగా తాజాగా మహేష్‌పై బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్ వీర్ సింగ్  ప్రశంసలు గుప్పించడం సూపర్ స్టార్  అభిమానులకు తెగ నచ్చింది. రణ్ వీర్ సింగ్ ప్రశంసలకి సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఓ వైపు సినిమాలు చేస్తూనే కమర్షియల్ యాడ్ షూట్స్‌లో పాల్గొంటూ ఉంటారు మహేష్. ఈ క్రమం లోనే రీసెంట్‌గా ఓ వాణిజ్య ప్రకటన కోసం తొలిసారి బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి మహేష్ బాబు పని చేశారు.

ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌తో తీసుకున్న ఓ ఫొటోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ర‌ణ్‌వీర్.. సూప‌ర్‌స్టార్‌ని ఓ రేంజ్‌లో పొగిడేశారు.మహేష్  తో కలిసి పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపిన రణ్‌వీర్.. నేను కలిసి పనిచేయాలనుకునే, కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తుల్లో మహేష్ బాబు ఒకరని అన్నారు. 'మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు ఎప్పటికీ విలువైనవే. బిగ్‌ బ్రదర్‌ పట్ల నాకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు. ఈ సందేశం చూసిన మహేష్.. ''నీతో కలిసి పని చేయడం గ్రేట్ బ్రదర్.. ఇద్దరిదీ సేమ్ ఫీలింగ్'' అంటూ సూపర్ రిప్లై ఇచ్చారు. వీళ్లిద్దరి ఈ సంభాషణ చూసి ఇదీ సూపర్ స్టార్ రేంజ్ అంటూ తెగ మురిసిపోతున్నారు మహేష్ అభిమానులు.ఇకపోతే సూపర్ స్టార్  ప్రస్తుతం‌ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘83’ విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: