టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్లాస్ సినిమాలు తీయడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. డాలర్ డ్రీమ్స్ మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ ఆ తర్వాత రాజా హీరోగా తీసిన ఆనంద్ మూవీ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత గోదావరి వంటి హృద్యమైన రొమాంటిక్ స్టోరీని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల దానితో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఆపై ఆయన తెరకెక్కించిన హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలు కూడా బాగా సక్సెస్ సాధించి కెరీర్ పరంగా శేఖర్ కమ్ములకి మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవల వరుణ్ తేజ్, సాయి పల్లవి ల కలయికలో శేఖర్ కమ్ముల తీసిన హృద్యమైన ప్రేమకథాచిత్రం ఫిదా రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి లతో కలిసి శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా సినిమా లవ్ స్టోరీ. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్ నిర్మాతగా ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సెన్సేషన్ టాక్ సంపాదించింది.

అయితే ఈ సినిమాకు సంబంధించి  లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి మంచి రొమాంటిక్, లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే పలు లవ్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకాభిమానుల మనసుని ఎంతో హత్తుకుంటాయని అలానే ఇప్పటి వరకు టాలీవుడ్ లో వచ్చిన ప్రేమకథా చిత్రాలన్నింటినీ మించేలా ప్రేక్షకుల మదిలో ఈ సినిమా ఎప్పటికీ పదిలంగా మిగిలిపోనుందని టాక్. ఇక తమ పాత్రల్లో హీరో నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి ఇద్దరూ కూడా ఎంతో ఒదిగిపోయి నటించారని, రిలీజ్ అనంతరం మూవీ మంచి సక్సెస్ సాధించడం ఖాయమని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తే గనుక నిజమైతే ఇది నిజంగా నాగచైతన్య అలాగే సాయి పల్లవిల అభిమానులతో పాటు హృద్యమైన ప్రేమకథా సినిమాలు ఇష్టపడే వారికి ఇది మంచి పండుగ న్యూస్ అని చెప్పక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: