ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్, యాక్షన్ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తుండగా ఆయనకు జోడీగా యువ భామ ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో బాలయ్య, బోయపాటి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా భారీ సక్సెస్ అందుకుని వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.

దానితో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా సినిమా పై అటు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఎంతో ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తరువాత క్రాక్ మూవీ దర్శకడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఇప్పటికే ఒక సినిమా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో దానికి సంబందించి పూర్తి వివరాలు వెల్లడికానున్నట్లు సమాచారం.

ఇక దీనితో పాటు మరొక సినిమా కూడా బాలయ్య సైన్ చేశారట. రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ మూవీ తో మెగాఫోన్ పట్టిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు అనే వార్త కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమేనని,  మూడు రోజుల క్రితం సంతోష్ శ్రీనివాస్ చెప్పిన ఒక స్టోరీ లైన్ ఎంతో నచ్చిన బాలయ్య, తన ప్రస్తుత కమిట్మెంట్స్ అనంతరం చేద్దాం అని ఆయనకు మాటిచ్చారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరలో ఈ మూవీ పట్టాలెక్కనుందట. మొత్తంగా అటు గోపీచంద్, ఇటు సంతోష్ శ్రీనివాస్, ఇలా ఇద్దరితో వరుసగా బాలయ్య రెండు సినిమాలు లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: