ఎవరికి జోకర్‌ పడితే వాళ్లే కింగ్ అయినట్లు, ఒకే ఒక్క హిట్‌తో సూపర్‌ స్టార్స్‌ అయినవాళ్లూ ఉన్నారు. ఆ ఒక్క హిట్‌ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నవాళ్లూ ఉన్నారు. అయితే ఒకే ఒక్క సినిమా ఇద్దరిని పాన్‌ ఇండియన్‌ స్టార్స్‌గా మార్చేసింది. ఆ ఇద్దరితో సినిమాలు చేసేందుకు దర్శకులు పోటీపడుతున్నారు. మరి సింగిల్‌ సినిమాతో సూపర్‌ స్టార్స్‌ అయిన వాళ్లిద్దరు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

'కె.జి.ఎఫ్' రిలీజ్ అయ్యేంతవరకు యశ్‌ అంటే కన్నడ వరకే పరిమితం. అక్కడ కూడా యశ్‌ మీడియం రేంజ్‌లోనే కనిపించాడు. అయితే అదంతా చరిత్ర. 'కెజిఎఫ్' ఎప్పుడైతే రిలీజ్‌ అయిందో, అప్పుడే యశ్‌ గ్రాఫ్ కూడా మారిపోయింది. పాన్‌ ఇండియన్‌ ఇమేజ్ వచ్చింది. స్టార్‌ మేకర్స్‌కి మోస్ట్‌ వాంటెడ్ మాస్ హీరోగా మారాడు యశ్. ఇప్పుడీ హీరోతో శంకర్‌తో సినిమా చేయబోతున్నాడు.

'కెజిఎఫ్'తో యశ్‌ని సూపర్‌స్టార్‌గా మార్చిన ప్రశాంత్ నీల్‌కి రోజు రోజుకి డిమాండ్‌ పెరిగిపోతోంది. ఈ డైరెక్టర్‌తో సినిమాలు చెయ్యడానికి హీరోలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలైతే ప్రశాంత్‌తో వర్క్ చేసేందుకు చెయ్యడానికి తెగ ఉత్సాహ పడుతున్నారు. ఇక ఈ మేకర్‌ కూడా తన యాక్షన్‌ కంటెంట్‌కి కరెక్ట్‌గా సెట్‌ అయ్యే ప్రభాస్‌తో 'సలార్' సినిమా స్టార్ట్ చేశాడు.

జూ.ఎన్టీఆర్ కూడా ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే డిస్కషన్స్‌ పూర్తయ్యాయని, వీళ్లిద్దరి కాంబోలో సినిమా రావడం కన్ఫామ్ అనే టాక్ వస్తోంది. అలాగే మహేశ్ బాబు కూడా ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తాడని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. మరికొంతమంది టాలీవుడ్‌ స్టార్స్ కూడా ప్రశాంత్‌ కోసం ట్రై చేస్తున్నారని చెబుతున్నారు.  

మొత్తానికి దర్శకుల మధ్య పోటీ మామూలుగా లేదు. ఇద్దరూ క్రేజీ ప్రాజెక్ట్స్ తో సినీ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతున్నారు.
శంకర్, ప్రశాంత్ నీల్ లు ఇలా పోటీ వాతావరణాన్ని సృష్టిస్తారని ఎవరూ ఊహించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: