మళయాళ ప్రేమం తో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఆ సినిమా హిట్ అవడం తెలుగులో ఆమెకు ఫిదా ఛాన్స్ వచ్చేలా చేసింది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది. శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత మళ్లీ అతని డైరక్షన్ లోనే సాయి పల్లవి సినిమా చేస్తుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టారు.

సినిమాలో కొత్త పాట సారంగ దరియ సాంగ్ రిలీజైంది. ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా రిలీజైందో లేదో అలా వైరల్ గా మారిన ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్స్ లో మొదటి స్థానంలో ఉంది. సుద్ధాల అశోక్ తేజా లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరక్టర్ పవన్ సి.హెచ్ బాగా కంపోజ్ చేశారు. సాయి పల్లవి సినిమాలో పాట అంటే అవి కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. వచ్చిందే సాంగ్ సూపర్ హిట్ కాగా.. ఆ తర్వాత రౌడీ బేబీ కూడా యూట్యూబ్ ను షేక్ చేసింది.

ఇక ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలో సారంగ దరియ సాంగ్ రిలీజ్ అవడమే ఆలస్యం యూట్యూబ్ లో క్రేజీ వ్యూస్ సాధించడమే కాకుండా ఈ సాంగ్ ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ కు దగ్గరైంది. తప్పకుండా సినిమాకు ఈ సాంగ్ మరింత స్పెషల్ క్రేజ్ తెచ్చేలా ఉంది. మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు.     
          

మరింత సమాచారం తెలుసుకోండి: