మిల్క్ బాయ్ లాంటి కుర్రాడు హీరో రామ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. డాన్స్ డైలాగ్స్, నటన, కామెడీ టైమింగ్ ఇలా అతనిలోని అన్ని అంశాలు అతనికి ప్లస్ అయ్యాయి. అక్కడక్కడ ఫ్లాపులు బెడద తగిలినా.... వాటిని చిరునవ్వుతో స్వీకరించి వాటిని గుణపాఠాలుగా  చేసుకునే పాజిటివ్ హీరో రామ్. అయితే హిట్లు, ఫ్లాపుల లెక్క ఎలాగున్నా ఈ యంగ్ హీరో క్రేజ్‌ మాత్రం అంతకు రెట్టింపు అవుతూనే వస్తోంది. పదిహేనేళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టిన రామ్ దేవదాసు చిత్రంతో హీరోగా మారారు.

ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో మరోసారి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన హీరో రామ్ అదే జోష్ తో తాజాగా రెడ్ సినిమాను చేసిన విషయం తెలిసిందే... అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయింది. కానీ  హీరో రామ్ మాత్రం ఈ చిత్రంలో తన ప్రతిభను కనబరిచారు. కాగా ఈ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఈ హీరో..... ఇప్పుడు మళ్లీ ఫుల్ స్పీడ్ తో పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సారి అందాల రాకుమారుడు రామ్ తన మార్కెట్ ను మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఆధ్వర్యంలో హీరో రామ్సినిమా చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో  టాక్ నడుస్తోంది. ఇప్పటికే లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు..వైజ‌యంతీ మూవీస్‌ సంస్థతో ఓ సినిమా కోసం హీరోగా  ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్‌, ఆయ‌న కుమార్తెలు స్వ‌ప్న‌, ప్రియాంక ద‌త్‌లు సినిమాను నిర్మించ‌బోతున్నార‌ట‌. ఈ న్యూస్ వింటుంటే... హీరో రామ్ నిజంగానే తన మార్కెట్ ను భారీగా పెంచేందుకు బాగానే ప్లాన్ చేసాడు అన్న విషయం అర్థమవుతుంది. మరి చూద్దాము ఇది ఎంతమేరకు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో...!

మరింత సమాచారం తెలుసుకోండి: