ఊహించని విధంగా సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ ధనుష్ కలిసి సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏసియన్ సినిమాస్ బ్యానర్ లో నారాయణ దాస్ నారంగ్, రాం మోహన్ రావు కలిసి నిర్మిస్తున్న సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలను డైరెక్ట్ చేసే శేఖర్ కమ్ముల ధనుష్ లాంటి మల్టీ టాలెంటెడ్ హీరోతో సినిమా చేయడం ఆడియెన్స్ కు షాక్ ఇస్తుంది. ఈ కాంబో సినిమాపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. ధనుష్ లాంటి హీరో ఓకే చెప్పాడు అంటే కచ్చితంగా శేఖర్ కమ్ముల ఈసారి తన పరిధి దాటి కథ రాసి ఉంటాడని అనుకుంటున్నారు.

శేఖర్ కమ్ముల స్కూల్ ఆఫ్ మూవీస్ అంటే అందరికి తెలిసిందే. సెన్సిబుల్ గా హృదయానికి హత్తుకునే ఎమోషన్స్ తో ఆయన సినిమాలు ఉంటాయి. అలాంటి శేఖర్ కమ్ముల ధనుష్ తో చేస్తున్న సినిమా కథ ఎలా ఉండబోతుంది అంటూ ఈక్వేషన్స్ చెప్పేస్తున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబో నిజంగా ఆడియెన్స్ కు మరో సెన్సేషనల్ మూవీ అందించడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు. ధనుష్ లాంటి హీరో సినిమా ఓకే చేశాడు అంటే కచ్చితంగా శేఖర్ కమ్ముల అద్భుతమైన కథ సిద్ధం చేసి ఉంటాడని చెప్పుకుంటున్నారు.

కొన్నాళ్లుగా ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా కోసం వేట మొదలు పెట్టాడు. తన మార్క్ మాస్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తాడని అనుకున్న ధనుష్ సడెన్ గా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సినిమాకు సైన్ చేసి షాక్ ఇచ్చాడు.ఈ సినిమా తెలుగు, తమిళం తో పాటుగా హిందీ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. కచ్చితంగ ఈ సినిమా లెక్క వేరే ఉంటదని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: