టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగి.. తర్వాత కనబడకుండా పోయిన టాప్ కమెడియన్ సునీల్. ప్రస్తుతం ఈ కమెడియన్ సునీల్ చేతిలో క్రేజీ ప్రాజెక్టు ఉంది. కనబడుటలేదు అనే పేరు గల చిత్రంలో సునీల్ నటిస్తున్నాడు. బాలరాజు అనే దర్శకుడు దీనికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించగా... తాజాగా పాపులర్ హీరోయిన్ శ్రీ దివ్య రిలీజ్ చేసి టీజర్ సోషల్ మీడియాలో సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. శ్రీదివ్య చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు.



ఇక సునీల్ నటిస్తున్న కనబడుటలేదు సినిమా టీజర్ గురించి మాట్లాడుకుంటే...  ఈ టీజర్ సినిమాలో ఉన్న  అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసింది. కథ విషయానికి వస్తే నగరంలో సీరియల్ మర్డర్ ల చుట్టూ తిరుగుతుందట. సునీల్ ఈ వరుస హత్యల కేసును సాల్వ్ చేస్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆధ్యంతం ఆసక్తిని కలిగిస్తాయట. నగరంలో జరిగే వరుస హత్యలకు ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఓ వ్యక్తే కారణమనే విధంగా టీజర్ ను మలిచారు. అతనెవరే సస్పెన్స్ ను ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. ఈ సస్సెన్ వీడాలంటే మూవీ విడుదయ్యేంత వరకు వేచి చూడాలని తెలుస్తోంది. మూవీలోనే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించనున్నాయి. ఈ మిస్టరీ సీన్లతో కనబడుట లేదు టీజర్ ను అందంగా మలిచారు.  



నూతన దర్శకుడు బలరాజు కథలో కొత్తదనాన్ని నింపాడని తెలుస్తోంది. కథను వివరించడానికి ఆయన ఓ కొత్త పంథాను ఎంచుకున్నాడని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. టీజర్ లో వచ్చిన ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి ఆడవారికి సెక్యూరిటీని ఇస్తుంది.. కానీ మగాడికి ఇన్ సెక్యూరిటీని ఇస్తుంది అనే డైలాగ్ ప్రేక్షకులు ఆలోచించేలా చేస్తందనడంలో ఎలాంటి సందేహం లేదు. రవితేజ అనే వ్యక్తి ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సరయు తలసి సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: