ఇలా ప్రతి ఒక్కరికీ మంచి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. ఇప్పటికే ఇందులోని వారంతా పలు రకాల షోలతో బిజీగా ఉంటున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. అయితే తాజా సమాచారం మేరకు జబర్దస్త్ టీమ్ మెంబర్స్ అందరితో కలిపి ఓ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రేష్మి, అనసూయ, సుదీర్, ఆది, శ్రీను ప్రధాన పాత్రలలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు చెబుతున్నారు కొందరు సినీ విశ్లేషకులు. మిగిలిన అందరూ టీమ్ మెంబర్స్ ఈ సినిమాలో కనిపిస్తారట. ఇందులో నటి రోజా, సింగర్ మనో లు కీలక పాత్ర పోషిస్తారని వినికిడి. ఈ చిత్రం కేవలం జబర్దస్త్ టీమ్ తో మాత్రమే రూపుదిద్దుకోపోతున్నట్లు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. హిలేరియస్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందట.
ట్రిప్ ని ప్లాన్ చేసి వెళ్తున్న ఫ్రెండ్స్ కి మార్గమధ్యంలో ఎదురయ్యే సమస్యలు కథను మరో మలుపు తిప్పుతాయని చివరికి ఆ సమస్యలు ఎవరు సాల్వ్ చేస్తారు... ఏం జరుగుతుంది అన్న కథనంతో ఈ సినిమా ని రెడీ చేస్తున్నారట. వినడానికి కాస్త రొటీన్ గా ఉన్న తెరపై మాత్రం సరికొత్తగా కనిపించేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఓ వైపు ఫుల్ కామెడీ మరో వైపు వణుకు పుట్టించే సంఘటనలు. ఈ సినిమాకి జబర్దస్త్ ట్రిప్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఈ జబర్దస్త్ సినిమా వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఈ సినిమాను మల్లె మల ఎంటెర్టైనేమెంట్స్ న్రిమించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కోసం వెతుకుతున్నారు. మరి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.