టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే వరుస హిట్లతో మాంచి జోరు మీదున్నాడు ఈ హీరో. అయితే సోషల్ మీడియాలో మహేష్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన ఏకైక సౌత్ హీరోగా మహేష్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అయితే తన సినిమాల విషయంలోనూ ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టాడు ఈ హీరో.ఇక తాజాగా మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మరో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది.2020 లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన 41 వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు సినిమా నిలిచింది.

అలాగే దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన ఏకైక చిత్రంగా కూడా నిలిచింది.ఇక తెలుగు నుంచి కూడా టాప్ 50 సినిమాల లిస్టులో ఏకైక సినిమా కూడా ఇదే నిలవడం విశేషం.ప్రపంచ వ్యాప్తంగా 278 కోట్లు వసూలు చేసిందట ఈ సినిమా.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా..విజయ శాంతి, సంగీత లాంటి సీనియర్ నటీమణులు కీలక పాత్రలు పోషించారు.సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక అదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురంలో సినిమా కూడా విడుదలైంది. 

సినిమా కూడా ఘన విజయం సాధించింది.అయితే 2020 లో టాలీవుడ్ తరపున ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా నిలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం  పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.ఈ సినిమా పూర్తయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్.ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: