యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీద ఉన్నాడు. ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పై ఉంచి ఏ హీరోకి సాధ్యం కాదని ఫీట్ ను చేస్తున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న
సినిమా రాధేశ్యామ్ ముందుగా విడుదల కాబోతుంది. ఈ
సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టుకోగా పలుసార్లు రీ షూట్ చేయడంతో ఈ
సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది.
పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు
రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
ఇక ఈ
సినిమా తర్వాత పాన్
ఇండియా చిత్రాల దర్శకుడు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే
సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
కేజీఎఫ్ చిత్రంతో అందరిని ఆకట్టుకున్న
ప్రశాంత్ సలార్ ఈ చిత్రాన్ని కూడా అదే రేంజ్ లో
ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ
సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. ఈ సినిమాలో పవర్ ఫుల్ మాఫియా డాన్ గా
ప్రభాస్ కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఈ రెండు చిత్రాలే కాకుండా
బాలీవుడ్ లో ఆయన డెబ్యూ చేస్తున్నా
ఆది పురష్
సినిమా కూడా సెట్స్ పైనే ఉంది.
ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై
బాలీవుడ్ ప్రేక్షకులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు.
కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుది. ఇక తాజాగా
ప్రభాస్ తన నాలుగవ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
మహానటి సినిమాతో
డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించిన
నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను మొదలు పెట్టాడు ప్రభాస్.
అశ్వినీ దత్ నిర్మించనున్న ఈ
సినిమా పాన్
ఇండియా కాకుండా పాన్ వరల్డ్
సినిమా అని గతంలో దర్శకుడు వెల్లడించాడు. ఈ
సినిమా ఈ రోజు
పూజా కార్యక్రమాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది.