బోయపాటి శ్రీను తో నందమూరి బాలకృష్ణకి మంచి అనుబంధం ఉంది. వ్యక్తిగతంగా సత్సంబంధాలు కలిగిన ఈ ఇద్దరూ కలిసి ఇప్పటివరకు రెండు సినిమాలు చేయగా అవి రెండూ ఒకదానిని మించేలా మరొకటి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టాయి. ఇక ప్రస్తుతం కొన్నేళ్ల విరామం తరువాత ఇద్దరూ కలిసి మళ్ళి చేస్తున్న సినిమా అఖండ. ఇక తొలిసారిగా బాలయ్య తో బోయపాటి శ్రీను తీసిన సినిమా సింహా.

బాలయ్య రెండు రోల్స్ లో కనిపించిన ఈ సినిమాలో నయనతార, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటించగా నమిత ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసారు. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీగా తెరకెక్కిన సింహా 2010లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత మరొక్కసారి 2014లో మరొకసారి బాలయ్య తో బోయపాటి తీసిన లెజెండ్ మూవీ కూడా సూపర్ హిట్ కొట్టి వారి కాంబోకి అందరి నుండి మంచి క్రేజ్ ఏర్పరిచింది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న అఖండ మూవీ ని మిరియాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తుండగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన బాలయ్య రెండు టీజర్స్ తో పాటు అడిగా అడిగా సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ వచ్చే నెలలో విడుదల కానుందని అంటున్నారు. ఈ మూవీ కోసం హీరో, హీరోయిన్స్  సహా యూనిట్ మొత్తం కూడా ఎంతో బాగా కష్టపడ్డాం అని, తప్పకుండా గతంలో బాలయ్య,బోయపాటి కలిసి చేసిన సింహా, లెజెండ్ సినిమాలని మించేలా రిలీజ్ తరువాత ఈ అఖండ మరింత అద్భుత విజయం అందుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: