కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతీ హాసన్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా సినిమాలకి దూరం కావడంతో ఏమైందో సినీ జనాలకు అర్థం కాలేదు. 'కాటమరాయుడు' తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుంది. ఆమె అన్ని రోజులు కనిపించకుండా పోవడానికి ఆల్కహాలే కారణంగా తెలుస్తోంది. ఆల్కాహాల్‌కి బానిస అయిపోయిన శ్రుతి, ఈ వ్యసనానికి దూరమయ్యాకే మళ్లీ బిజీ అయ్యిందని సమాచారం. 'క్రాక్‌'తో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్.. ప్రభాస్‌తో 'సలార్‌' చేస్తూ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

పూజా భట్ కూడా తన తప్పుని తెలుసుకుంది. తన జీవితంలో పెద్ద పొరపాటు చేశానని భావిస్తోంది. భయాల నుంచి దూరం కావడానికి పూజ మందుకి దగ్గరైందని తెలుస్తోంది. దీంతో చాలా సమస్యలను ఎదుర్కొందట. అయితే తండ్రి మహేశ్‌ భట్‌ మాటలతో ఈ వ్యసనం నుంచి ఎట్టకేలకు బయటపడింది. 2017 నుంచి మళ్లీ మందు ముట్టుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది పూజా భట్. మనీషా కోయిరాల అయితే ఆటోబయోగ్రఫీ 'హీల్డ్‌- హౌ కేన్సర్ గేవ్‌ మి ఏ న్యూ లైఫ్‌'లో మందుకి బానిసవ్వద్దని పేజీల కొద్ది స్టేట్ మెంట్స్ రాసింది. మందు నుంచి బయటపడ్డాక కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

రణ్‌బీర్ కపూర్‌కి అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రణ్‌బీర్‌ కాలేజ్‌డేస్‌లో డ్రగ్స్‌ తీసుకున్నానని చెప్పాడు. తర్వాత హెల్త్‌కి మంచిదికాదని డ్రగ్స్‌ మానేశానని చెప్పాడు. అయితే డ్రగ్స్‌కి దూరమైనా సిగరెట్‌ని విడిచిపెట్టలేకపోతున్నానని బాధ పడుతున్నాడు రణ్‌బీర్. హీరో సంజయ్‌ దత్ డ్రగ్స్, ఆల్కహాల్‌ ను బాగా తీసుకునేవాడు. 'సంజు' సినిమాలో చూపించినట్టు  డ్రగ్స్‌కి బానిసయ్యాడు. అయితే ఆ తర్వాత తండ్రి సునీల్ దత్‌ సాయంతో అమెరికన్ రిహాబిలేషన్‌ సెంటర్‌లో జాయిన్ అయ్యాడు. డ్రగ్స్ నుంచి బయటపడి మళ్లీ కెరీర్‌ స్టార్ట్ చేశాడు. షోలో' సినిమా సమయంలో అమితాబ్‌ బచ్చన్‌కి ఎంత పేరు వచ్చిందో, ధర్మేంద్రకి అంతకంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇలాంటి హీరో బిగ్‌బీ రేంజ్‌లో నిలబడలేకపోవడానికి ఆల్కాహాల్ ఓ కారణమని చెబుతారు. ధర్మేంద్ర కూడా 'యమ్లా పగ్లా దీవానా' రిలీజ్‌ సమయంలో మందు వల్ల తన భవిష్యత్ నాశనమైపోయిందని బాధపడ్డాడు. అయితే 15 ఏళ్లు వెంటాడిన ఈ అడిక్షన్‌ నుంచి బయటపడేందుకు కథలు రాయడం మొదలుపెట్టానని, మెల్లగా మందుకు దూరమయ్యానని చెప్పాడు ధర్మేంద్ర.



మరింత సమాచారం తెలుసుకోండి: