టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  ఇండియా సినిమాలతో బిజీబిజీ గా షూటింగ్ లో ఉన్నాడు. ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యాం ఏ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటుగా ఆదిపురుష్ కూడా షూటింగ్ పూర్తి చేశాడు ప్రభాస్. ఇక పోతే ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా సెట్స్ మీద ఉంది. అంతేకాకుండా ప్రశాంత్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా 2022 నాటికి షూటింగ్ పనులు కూడా పూర్తి చేస్తారట. అయితే సందీప్ వంగ తో  ఈ అన్ని సినిమాల తర్వాత  ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ నటించబోయే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక బాలీవుడ్ స్టార్ ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో లో ప్రభాస్ తో పాటుగా మరో స్టార్ హీరో కూడా హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే అది కూడా కబీర్ సింగ్ సినిమాలో నటించిన షాహిద్ కపూర్ ప్రభాస్ తో కలిసి నటించిన ఉన్నట్టుగా తెలుస్తోంది.అయితే  ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో ..

ప్రభాస్ తో పాటుగా షాహిద్ కపూర్ కూడా నటిస్తే ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఎప్పుడు తను చేసే సినిమాల పై చాలా కాన్ఫిడెంట్ గా ఉండే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక మరోవైపు ప్రభాస్ తాజాగా నటించిన 'రాధే శ్యామ్' సినిమా విడుదలకు ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: