: తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ తను నటించిన సినిమాలలో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇప్పటికి కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా దృశ్యం-2, నారప్ప వంటి సినిమాలతో మంచి హిట్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఎఫ్ త్రీ సినిమాలో నటిస్తున్నాడు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కూడా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుంది అన్నట్లు సమాచారం. అయితే వెంకటేష్ నటించిన కొండపల్లి రాజా సినిమా వెనుక చాలా పెద్ద కథ జరిగిందట. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

1993 లో డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి నిర్మాతగా కె.వి.వి.సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సినిమా హిందీ లో "అన్నామలై" గా తెరకెక్కించడం జరిగింది. అయితే నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ మాత్రం   సినిమాని చిరంజీవితోనే తీయాలని భావించి ఈ సినిమా రైట్స్ ని తనే సొంతం చేసుకున్నాడు. ఇక ఇందులో ఒక లైన్ స్టోరీని చిరంజీవికి చెప్పగా.. చిరంజీవి కూడా చాలా బాగుందని చెప్పారట. కానీ వెంకటేష్ మాత్రం ఈ సినిమా చేస్తానని సత్యనారాయణ దగ్గరికి వెళ్లారట. కాని వీరిరువురి కాంబినేషన్లో ఇదివరకే సుందరకాండ సినిమా మా షూటింగ్ జరుగుతూ ఉంది.

ఇక కొండపల్లి రాజా మూవీ లో హీరో సుమన్ కూడా నటించడం గమనార్హం ఈ మూవీలో నగ్మా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అన్నామలై అనే మూవీ హిందీ మూవీ.. ఈ సినిమాని ఒక తెలుగు హీరో నటించడం అప్పట్లో చాలా వివాదానికి దారి తీసింది. ఈ వివాదంలో నిర్మాత సత్యనారాయణ జైలుకు కూడా వెళ్లారు. దాని కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి ఆ వివాదం నుంచి నిర్మాత బయటపడినట్లు సమాచారం. ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: