1993 లో డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి నిర్మాతగా కె.వి.వి.సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సినిమా హిందీ లో "అన్నామలై" గా తెరకెక్కించడం జరిగింది. అయితే నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ మాత్రం ఈ సినిమాని చిరంజీవితోనే తీయాలని భావించి ఈ సినిమా రైట్స్ ని తనే సొంతం చేసుకున్నాడు. ఇక ఇందులో ఒక లైన్ స్టోరీని చిరంజీవికి చెప్పగా.. చిరంజీవి కూడా చాలా బాగుందని చెప్పారట. కానీ వెంకటేష్ మాత్రం ఈ సినిమా చేస్తానని సత్యనారాయణ దగ్గరికి వెళ్లారట. కాని వీరిరువురి కాంబినేషన్లో ఇదివరకే సుందరకాండ సినిమా మా షూటింగ్ జరుగుతూ ఉంది.
ఇక కొండపల్లి రాజా మూవీ లో హీరో సుమన్ కూడా నటించడం గమనార్హం ఈ మూవీలో నగ్మా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అన్నామలై అనే మూవీ హిందీ మూవీ.. ఈ సినిమాని ఒక తెలుగు హీరో నటించడం అప్పట్లో చాలా వివాదానికి దారి తీసింది. ఈ వివాదంలో నిర్మాత సత్యనారాయణ జైలుకు కూడా వెళ్లారు. దాని కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి ఆ వివాదం నుంచి నిర్మాత బయటపడినట్లు సమాచారం. ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది.