సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా బాలయ్య నట విశ్వరూపం చూపించడంతో పదేపదే అఖండ ను చూస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీళ్లంతా కూడా అఖండ పై ప్రశంసల వర్షం కురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో సపోర్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినోట జై బాలయ్య నినాదం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా జై బాలయ్య అన్నారు.
శర్వానంద్ లక్ష్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జై బాలయ్య అంటూ స్పీచ్ స్టార్ట్ చేశారు. థియేటర్లకు మళ్ళీ బాలయ్య పూర్వ వైభవం తీసుకువచ్చారని... లక్ష్య సినిమాతో జనాలు జై శౌర్య అనాలని ... ఆ రేంజ్ లో ఈ సినిమా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ఇక అఖండ సినిమా ఇప్పటికే నైజాం తో పాటు ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. వారం రోజులు పూర్తయ్యే సరికి ఈ సినిమా ఓవరాల్ గా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.