ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యాం చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.
మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని హడావుడిగా పని చేస్తోంది చిత్ర యూనిట్. జనవరి 12 వ తేదీన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా
కరోనా నేపథ్యంలో ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.
ఈసారైనా ఈ చిత్రం తప్పకుండా విడుదలై ప్రేక్షకుల నుండి అలరిస్తుందని అని
ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మార్పు విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. మొదట్లో ఈ చిత్రానికి రాదే
శ్యామ్ అనే చిత్రం టైటిల్ అనుకోలేదు అన్న విషయం అందరికి తెలిసిందే. కొన్నిరోజులు
జాన్ అనే పేరుతో పిలిచారు అయితే అదే సమయంలో దిల్ రాజు ఎంట్రీ ఇచ్చి ఈ
సినిమా టైటిల్ ను మార్చివేశాడు.
తమిళ
సినిమా పరిశ్రమలో సూపర్ హిట్ అయినా
96 సినిమా తెలుగులో శర్వానంద్ మరియు
సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ
సినిమా తెలుగులో మాత్రం మెప్పించ లేకపోయింది అయితే ఈ చిత్రానికి జాను అనే టైటిల్ ను పెట్టడం రాధే
శ్యామ్ చిత్రం పట్ల శాపంగా మారింది. తప్పకుండా ఈ
సినిమా టైటిల్
మార్చి విడుదల చేయాల్సిన అవసరం కావడంతో కొత్త
సినిమా టైటిల్ కోసం ఎదురు చూసి చివరకు ఈ చిత్రం టైటిల్ ను రాధే
శ్యామ్ గా పెట్టారు. అయితే ఈ టైటిల్ ఎంతో క్లాస్ గా ఉండడం తో అందరు దీనిపై కొంత నెగెటివ్ గా ఉన్నారు. అయితే ఈ చిత్ర ట్రైలర్ చూశాకా ఈ
సినిమా కి తగ్గ టైటిల్ పెట్టారు అని అందరు అన్నారు.