ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు యువ దర్శకుడు చందు ముండేటి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కార్తికేయ 2 ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక కార్తికేయ 2 చిత్రాన్ని చందు ముండేటి తెరకెక్కించిన విధానం  ఎంత అద్భుతంగా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇదిలావుంటే ఇక శ్రీకృష్ణుడి నేపథ్యంలో సాగే అడ్వెంచర్ జర్నీగా కార్తికేయ 2 ప్రేక్షకులని మెప్పిస్తోంది.ఇకపోతే హిట్ పడ్డప్పుడు సహజంగానే నిర్మాతలు ఆ దర్శకుడి వెంట పడతారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకుంటారు  కూడా. 

అయితే తాజాగా నిర్మాత అల్లు అరవింద్.. చందు ముండేటితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే  తాజా సమాచారం ప్రకారం చందు ముండేటి తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది.కాగా వరుణ్ తేజ్ తో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన గని చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే తమ సంస్థ వల్ల తప్పు జరిగింది కాబట్టి.. వరుణ్ తేజ్ తానే హిట్ ఇవ్వాలని అరవింద్ డిసైడ్ అయ్యారట. పోతే వరుణ్ తేజ్ సినిమా చేసేందుకు కథ రెడీ చేయమని చందు ముండేటిని అల్లు అరవింద్

 కోరినట్లు  తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది తెలుస్తోంది.ఇదిలావుంటే చందు ముండేటి కూడా తొందర పడకుండా కార్తికేయ 2 ఇచ్చిన విజయాన్ని కొనసాగించే పనిలో ఉన్నారు. ఈయన తెరకెక్కిచిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి విజయానికి సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోతే  మంచి కథతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. కాగా వరుణ్ తేజ్ తదుపరి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించాల్సి ఉంది.ఇదిలావుంటే  కార్తికేయ 2 దర్శకుడితో మూవీ కూడా కంఫర్మ్ అయితే.. మెగా హీరో ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: