తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా ఇంకా నిలదొక్కుకోని కొంతమంది హీరో లు ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేయడానికి సిద్ధం అవుతూ ఉండడంతో కొంతమంది ఆశ్చర్య పడిపోతున్నారు. వాస్తవానికి తెలుగు సినిమా పరిశ్రమలో సరైన విజయం అందుకొని హీరోలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాలో డెబ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో సినిమా ను మొదలు పెట్టి దాన్ని విడుదల చేయడం చేస్తూ ఉండగా ఇప్పుడు ఆ జాబితాలోకి మరొక హీరో కూడా చేరిపోయాడు.

అక్కినేని అఖిల్ తెలుగులో ఇప్పటిదాకా నాలుగు సినిమాలను చేయగా ఆ నాలుగు సినిమాల తో నూ ప్రేక్షకులను ఎంతో నిరాశపరిచాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్వాలేదు అనిపించుకునే హిట్ అయింది. దానితో ఇప్పుడు ఐదవ సినిమాతో ప్రేక్షకులను అందిం చాలని ఒక యాక్షన్ సబ్జె క్ట్ ఎంచుకు న్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న ఈ హీరో ఈ చిత్రం విడుదల చేస్తూ ఉండగా ఈ సినిమా ద్వారా మంచి విజయం అందుకోవడం ఖాయం అని అఖిల్ భావిస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత ఒక డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటి కే అక్కడ దర్శకులు కొంతమంది ఆయనను సంప్రదించి కథ లు చెబుతున్నారట. ఈ సినిమాలో ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడతాయా అనేది చూడాలి. తెలుగులోనే ఇంత సెటిల్ కానీ ఈ హీరో చేస్తున్న ఈ బాలీవుడ్ ప్రయత్నం ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. డిసెంబర్లో ఏజెంట్ సినిమాలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉండగా నాగార్జున ఈ సినిమాలో బాలీవుడ్ లో విడుదల చేసే బాధ్యతలు తీసుకు న్నాడు. అలాగే బాలీవుడ్ లో అఖిల్ సినిమా చేసే బాధ్యతను కూడా ఆయన తీసుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: