
కేవలం ఐదు రోజుల్లోనే రూ. 542 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తోందో చెప్పవచ్చు. మళ్లీ బాలీవుడ్ పూర్వ వైభవాన్ని తీసుకురావడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో బాలీవుడ్ మళ్లీ తన గత వైభవాన్ని పొందబోతోంది అని అక్కడ దర్శక నిర్మాతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కేజీఎఫ్ 2, బాహుబలి 2 రికార్డులను అధిగమించి అత్యంత వేగంగా 200 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది కేవలం 4 రోజుల్లోనే రూ.429 కోట్లు రాబట్టింది ఈ చిత్రం.
జాన్ అబ్రహం ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ సక్సెస్ అందుకొని దూసుకుపోతున్న నేపథ్యంలో పార్ట్ 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నామంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చ జరుగుతుండగా ఇదే ప్రశ్నకు ఇప్పుడు చిత్ర బృందం సమాధానం తెలిపింది. డైరెక్టర్ సిద్దార్థ్ మాట్లాడుతూ .." షారుక్ తో సినిమా చేయాలనే కళ నెరవేరింది . మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి" అంటూ స్పష్టం చేశారు. మరి పఠాన్ సీక్వెల్ వస్తుందా లేదా అనేది మాత్రం సందేహంగా మారింది.