సూపర్ స్టార్ మహేష్ బాబు పోయిన సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇలా సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మహేష్ ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో మహేష్ సరసన పూజా హెగ్డే ... శ్రీ లిల హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. విరిద్దరి పాత్రలు కూడా ఈ మూవీ లో చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ మూవీ.లో శ్రీ లీల పాత్ర అదిరిపోయే రేంజ్ లో దర్శకుడు రాసుకున్నట్లు. .. అదే రేంజ్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ సినిమా యూనిట్ ప్రకటించలేదు.

మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా పొందుతున్న నేపథ్యంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఈ సినిమా బృందం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ ఉగాది కి ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఉగాది కి ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ ను మరియు టైటిల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: