తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా రీ రిలీజ్ సినిమాలు విడుదల చేస్తు ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. ఈ చిత్రాలలో కూడా నయా ట్రెండు కొనసాగిస్తున్న హీరోలు కూడా సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోల చిత్రాలు 4k క్వాలిటీతో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా లెజెండ్ తరానికి చెందిన ఇద్దరు హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.


అప్పట్లో ఎన్నో చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని పొలిటికల్ గా కూడా మంచి పేరు సంపాదించిన నటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు సీనియర్ ఎన్టీఆర్ బర్తడే మే 28వ తేదీ కావడం చేత ఆయన నటించిన అడవి రాముడు చిత్రాన్ని 4k క్వాలిటీతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే పొలిటికల్ వైఫ్ అడుగులు వేసి టిడిపి పార్టీని స్థాపించి 9 నెలలలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు.


ఇక మరొక నటుడు సూపర్ స్టార్ కృష్ణ మే 30వ తేదీన ఆయన బర్త్డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని 4k క్వాలిటీతో రి రిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తన సినీ కెరీర్ లోనే ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించడమే కాకుండా ఎంతో టెక్నాలజీని కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దీన్నిబట్టి చూస్తే ఇక మీదట లెజెండ్రీ తరానికి చెందిన నటుల సినిమాలు కూడా రీ రిలీజ్ కు సిద్ధంగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎవరెవరీ  చిత్రాలు రీ  రిలీజ్ కు నోచుకుంటాయో చూడాలి మరి. ఇలా వచ్చిన కలెక్షన్లను నిర్మాతలు ఏవైనా మంచి పనులకు ఉపయోగిస్తే బాగుంటుందని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: