కన్నడ బ్యూటీ నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ జోరు చూపిస్తోంది. చలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన 'గీతాగోవిందం' సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాతో ఏకంగా ఫ్యాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప తర్వాత రష్మిక మందన బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది.

 పుష్ప సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కన్నడ బ్యూటీ కి బాలీవుడ్లో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా 'జరా హట్కే జర బచ్కే: సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విక్కీ కౌశల్ తన నెక్స్ట్ మూవీ ని అదే సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఉత్కర్తో చేస్తున్నాడు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించే ఛాన్స్ అందుకుంది. మరాఠీ చారిత్రాత్మక నవల ఆధారంగా

సినిమా రూపొందునున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తోనే ఈ ప్రాజెక్టు తెరకెక్కనుందట. ఇక ఇలాంటి పీరియాడికల్ భారీ బడ్జెట్ మూవీలో మూవీ టీం రష్మికను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. రష్మిక మందన్న ప్రజెంట్ పుష్ప సీక్వెల్ తో పాటు బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సినిమా చేస్తోంది రష్మిక మందన్న. రీసెంట్ గానే యానిమల్ మూవీలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆగస్టులో ఈ మూవీ విడుదల కానుంది. ఇక వీటితోపాటు నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది వెంకీ కుడుముల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతోపాటు రెయిన్ బో అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం కూడా చేస్తోంది రష్మిక మందన..!!

మరింత సమాచారం తెలుసుకోండి: