2023 ఆస్కార్ అవార్డులో తెలుగు సినిమాలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆస్కార్ రేసులో మొట్టమొదటిసారిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా సంచలనాన్ని సృష్టించింది. అందులో భాగంగానే నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. మొదటిసారి ఓ తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కడం భారతదేశానికే ఓ తీపి గుర్తుగా మారింది. ఇక వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టేసారు. 2024 ఆస్కార్ అవార్డుల్లో కూడా ఇదే జోరు ఇండియన్ సినిమాలు ప్రదర్శిస్తాయా అనే ఆసక్తి సైతం అందరిలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ పోటీలోకి ఎంట్రీ ఇచ్చే సినిమాలు ఏవి?

 ఆపై ఫైనల్ నామినేషన్స్ లో అర్హత సాధించే చిత్రాలు ఏవి? అనే లెక్కలు మొదలైపోయాయి. తాజాగా ప్రముఖ కన్నడ నిర్మాత గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన మొత్తం 17 మంది సభ్యులతో ఇండియన్ నుంచి ఆస్కారికి ఎంపిక చేసే చిత్రాల జాబితా తయారు చేసేందుకు చెన్నైలో కసరత్తు మొదలైంది. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ టాలీవుడ్ నుంచి ఈ ఏడాది కేవలం రెండు సినిమాలు మాత్రమే ఆస్కార్ ఎంట్రీ కి పోటీ పడే చిత్రాల లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' కాగా మరొకటి వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన 'బలగం' సినిమాలు అని సమాచారం. ఇందులో దసరా సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో మద్యపానం, కుల వివక్షత, 

పెత్తందారితనం లాంటి సామాజిక అంశాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. ఫ్రెండ్షిప్ ని కూడా చాలా ఎమోషనల్ గా చూపించారు. అలాగే నాని, కీర్తి సురేష్లవ్ స్టోరీ కూడా ఎంతో న్యాచురల్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి ఎంతగానో కనెక్ట్ అయ్యారు. నాని ఈ సినిమాతో మొదటి పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇక బలగం విషయానికొస్తే.. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కుటుంబ బంధాలని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ కనబరిచారు.మరోవైపు ఈ రెండు సినిమాల్లో ఆస్కార్ అవార్డు అందుకునే అవకాశం బలగం సినిమాకే ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: