ఇందులో నాగార్జున సరసన వరలక్ష్మి అనే పాత్రలో ఆశికా రంగనాథ్ నటిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా కథను డైలాగులను సైతం ప్రసన్నకుమార్ బెజవాడ అందిస్తూ ఉన్నారు. మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఫోరింజు మరియమ్ జోష్ అనే చిత్రాన్ని రీమిక్కుగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తున్న ఆషిక రంగనాథ్ ఆమె రెడీ అయిన విధానం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఈమె రెడీ అవుతూ ఉండగా పక్కనే ఉన్న గోడలో నుంచి నాగార్జున ఆమెను చూస్తూ ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. వీరిద్దరి జోడి కాస్త ఎబ్బేట్టుగానే కనిపిస్తోంది అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. నాగార్జున సరసన ఆశిక చాలా చిన్న పిల్లల కనిపిస్తోందంటూ నాగార్జునకు తగ్గ జోడి పెడితే బాగుండేదేమో అన్నట్లుగా పలువురు అభిమానులు సైతం తెలుపుతున్నారు. అయితే కథను బట్టి పాత్రను బట్టి ఈమెను తీసుకుని ఉండవచ్చు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. వచ్చే ఏడాది ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది .ఎలాగైనా నాగార్జున కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం ఈ రోజు నుంచే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి